by సూర్య | Thu, Sep 22, 2022, 08:56 PM
వైసీపీ శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదనను వై.ఎస్.జగన్ నాడే తిరస్కరించారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని చెప్పారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని... ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని అన్నారు.
Latest News