by సూర్య | Thu, Sep 22, 2022, 08:50 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వారిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేయగా.. రాష్ట్ర అటవీ పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతి, వినియోగం, ప్రింటింగ్, రవాణా, ప్రదర్శనపై నిషేధం విధించారు.నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీలకు రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉల్లంఘించిన వారిని పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులు కాటన్, నేత వస్త్రాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.
Latest News