by సూర్య | Thu, Sep 22, 2022, 04:20 PM
రెండ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరు నాగేశ్వర రావును గురువారం మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, శ్రీనివాస్ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విశాఖ నగరాభివృద్ధికి పాటుపడాలని మంత్రి కోరగా, పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాల సహకరించాలని మేయర్ కోరారు. వైసీపీ బలోపేతానికీ కృషి చేయాలన్నారు. నగర వైసీపీ కార్యాల యంలో జరిగిన ఓ సమావేశంలో భాగంగా ఈ కలయిక జరిగింది.
Latest News