సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తాం

by సూర్య | Fri, Apr 26, 2024, 03:13 PM

కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు. మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలోని 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంతకు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. ఎమ్మెల్యే వసంతతో పాటు ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News

 
నేటి పంచాంగం 08-05-2024 Wed, May 08, 2024, 10:43 AM
జగన్ను గెలిపించండి: లక్ష్మీ భార్గవి Wed, May 08, 2024, 10:39 AM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 10:39 AM
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM